Mane Praveen

May 03 2024, 20:57

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే సందర్భంగా శుక్రవారం ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్, జగాల్ రెడ్డి శ్రీశైలం, జింకల వెంకన్న, కస్తాల వెంకన్న, చింటూ, చరణ్, రామకృష్ణ, చందు, బ్రహ్మచారి, బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 03 2024, 08:20

TG: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది.

వాస్తవానికి నేటితో ఈ గడువు ముగియగా.. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాళాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కూడా టీఎస్‌బీఐఈ ఖాతాకు అదే తేదీలోగా ఫీజులు చెల్లించాలని సూచించింది.

తెలంగాణలో మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం గం. 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం గం. 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

Mane Praveen

May 02 2024, 18:45

NLG: ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు

నల్గొండ: పట్టణ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి లతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .

SB NEWS NLG

Mane Praveen

May 02 2024, 11:51

NLG: ఉచితంగా విద్య- వైద్యం అందిస్తాం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా విద్య- వైద్యం అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మరిగూడ మండలం తమ్మడపల్లె, తిరుగండ్లపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం మరియు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.

సిపిఎం పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని అయినప్పటికీ రోజు కూలి వంద మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సిపిఎం అభ్యర్థులు గెలిపించినట్లయితే ఉపాధి హామీ రోజు కూలి రూ. 600 తో పాటు 210 పని దినాలు గ్యారెంటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

రోజుకు ఒక పార్టీ మారే నాయకులను నమ్మొద్దని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య , వెంకటయ్య అంజయ్య చారి, దామెర లక్ష్మి, ఆయిలు కృష్ణయ్య, ప్రతాపరెడ్డి అమృత, యాదమ్మ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 01 2024, 19:02

మే డే స్ఫూర్తిని కొనసాగిద్దాం: నెల్లికంటి సత్యం సిపిఐ జిల్లా కార్యదర్శి
చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా  పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. 138 వ మేడే దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు.

చికాగో నగరంలో చిందిన రక్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు నాంది పలికిందని అనేక కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, పెట్టుబడుదారు వ్యవస్థకు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తుందన్నారు.

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ కార్మిక వర్గాన్ని మరింత దోపిడికి గురి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరస్వామి,గురిజ రామచంద్రన్,  నరసింహ, వెంకటేశ్వర్లు, లెనిన్, ముత్యాలు, వెంకన్న, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 01 2024, 18:17

కార్మికుల శ్రమ వలన వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాల్సిందే: సిపిఎం

NLG: కార్మికులు తమ రక్తం దారపోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని, కార్మికులకు అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడ మండల కేంద్రంలో మే డే సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరించి మాట్లాడారు.

పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని దినం తీసుకురావడం అంటే శ్రామికుల శ్రమను దోపిడి చేయడమేనని, పెట్టుబడుదారుల కొమ్ము కాయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల జీవితాలతో చలగాటమాడుతుందని ఆరోపించారు. ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

మే డే సందర్భంగా మర్రిగూడ మండలంలో ఇందుర్తి, శివన్న గూడెం, మర్రిగూడెం కేంద్రాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యుల మైలసత్తయ్య, కొట్టంయాదయ్య , పోలే పల్లి రాములు, పగిళ్ల రామచంద్రం లపంగి లింగయ్య, వెంకటయ్య, లక్ష్మణ్,ముత్యాలు, నరేష్, ఐద్వా మండల నాయకురాలు దామెర లక్ష్మి , హేమలత, ఇందిరమ్మ, సిద్ధగొని మహేష్, పిట్టల రమేష్ , సుప్పరి హనుమంతు, శ్రీరాములు, మారగోని సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 01 2024, 07:17

NLG: పోలింగ్ సిబ్బంది కి శిక్షణ తరగతులు

నల్గొండ పార్లమెంటు ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుండి 4 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. 

పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

 ఈ ఉత్తర్వులను మే ఒకటి నాటికి సంబంధిత అధికారులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

రెండో విడత శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రెండు విడతల శిక్షణ కార్యక్రమాలు వారికి విధులు కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. 

Mane Praveen

Apr 30 2024, 16:19

బిజెపితోనే అభివృద్ధి సాధ్యం: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

దేశం మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ, గుండాల మండలం, వంగాల గ్రామం 272 వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి మాట్లాడుతూ... వారసత్వ రాజకీయాలు అవినీతి పాల్పడే పార్టీలు ప్రజల అభివృద్ధి చేయలేవని, ప్రజలకు తెలియజేప్పుతూ మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు.మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు.

మరోసారి బిజెపిని గెలిపించి అభివృద్ధిని చేసే అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు సింగారం, గంగాపురం రమేష్, ఇమ్మడి నాగరాజు, ఆవుల సాయితేజ , కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 30 2024, 15:55

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో ఈ రోడ్ షో కార్యక్రమానికి జనం వచ్చారు. అశేష జనం ను చూసిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడం ఖాయం అని అన్నారు.

ఈ రోడ్ షో కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పున్నా కైలాస్ నేత, నియోజకవర్గం కోఆర్డినేటర్ బొజ్జ సంధ్యా రెడ్డి, సిపిఐ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 30 2024, 11:33

NLG: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి సహకారంతో మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన, మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి విజేతగా నాంపల్లి టీం, 2వ విజేతగా పసునూరు టీం, 3వ విజేతగా మెల్లవాయి టీం గెలుపొందారు. 

గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతిగా రూ.20,116, ద్వితీయ బహుమతిగా రూ.15,166, తృతీయ బహుమతిగా రూ.7,166 లు మరియు షీల్డ్ లను ప్రధానోత్సవం చేశారు. 

ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ... యువత క్రీడారంగంలో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి ,మండల నాయకులు గెల్వాల్ రెడ్డి, క్రీడాకారులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.